
నారాయణపేట జిల్లా, కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణం కేవలం రూ. 5కే చొక్కా అందిస్తామని ప్రకటించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణం ముందు బారులు తీరారు. అయితే, ఈ ఆఫర్ అందరికీ వర్తించదని దుకాణ యజమాని తెలిపారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న వస్త్ర దుకాణ యజమాని తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం మాత్రమే ఈ ప్రత్యేక ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపారు. కానీ ఆఫర్ చూసి తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. వందలాది మంది దాదాపు రెండు గంటల పాటు దుకాణం ముందు వరుసలో నిలుచున్నారు. జనం అధిక సంఖ్యలో రావడంతో దుకాణం తెరవడం యజమానికి కష్టతరంగా మారింది. చివరకు దుకాణం తెరిచి, వచ్చిన అందరికీ దుస్తులను అందించారు.
మరిన్ని వీడియోల కోసం :