
అయితే, ప్రస్తుతం నెలకొన్న కొరత కారణంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన లోడ్లు నిలిచిపోయాయి. చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంధన ట్యాంకర్లు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే టోకెన్ల వారీగా, అత్యంత పరిమిత సంఖ్యలో సిలిండర్లను కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు లేదా రవాణా సంబంధిత సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ సరఫరా నిలిచిపోవడం వల్ల రాబోయే రోజుల్లో రవాణా రంగంపైన, నిత్యావసర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్లో నయా స్ట్రాటజీ