నీళ్ల కోసం పులి మళ్లీ నీటి కుంట దగ్గరకు వస్తుందని ఫారెస్ట్ సిబ్బంది కాపుకాస్తున్నారు. పులి జాడలు కన్పించిన ప్రాంతంలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులకు సూచించారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించేందుకు ఆపరేషన్ చేపట్టారు. నల్లమల అడవి దగ్గరగా ఉండటం తో పులి అక్కడి నుంచే ఇటువైపు వచ్చిందని భావిస్తున్నారు. పులి తమ కంటపడితే బంధించి మళ్లీ అడవిలోకి తరలిస్తామన్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోనూ పులి కలకలం రేపింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వారం రోజులపాటు వణికించగా.. ఎట్టకేలకు స్పెషల్ ఆపరేషన్తో బంధించారు. ఆ తర్వాత.. విశాఖ జూలో ట్రీట్మెంట్ చేసి.. పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. డీప్ ఫారెస్ట్లోకి వెళ్లిన అదే పులి.. మళ్లీ పల్లెబాట పట్టిందని రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల్లో హైటెన్షన్ క్రియేట్ ఏర్పడింది. ఆయా గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. బోలకొండ, తాళ్లపాలెం, భీమవరం, చొప్పరిపాలెం, చెరువూరు, నిమ్మలపాలెం, గుంజుగూడెం గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ తాళ్లపాలెం గ్రామస్తులు.. ఫారెస్ట్ సిబ్బందితో కలిసి రాత్రుళ్లు గస్తీ కాస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :