Headlines

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు తీరప్రాంతం ప్రస్తుతం విదేశీ పక్షుల కిలకిల రావాలతో కళకళలాడుతోంది. ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్, మానేరు తీరప్రాంతం వలస పక్షుల రాకతో ఒక అద్భుతమైన ప్రకృతి స్వర్గధామంగా మారింది. ప్రతి ఏటా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంగోలియా, టిబెట్, సైబీరియా, యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బార్ హెడెడ్ గీస్, పల్లాస్ గల్, పోచార్డ్స్, టీల్స్ వంటి అరుదైన జాతులు మానేరు జలాలపై విహరిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గాల్లో చక్కర్లు కొడుతూ, నీటి అలలపై తేలియాడుతూ ఈ పక్షులు చేసే విన్యాసాలు ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్లకు కనువిందు చేస్తున్నాయి. మానేరులో పుష్కలంగా ఉన్న నీటి నిల్వలు, స్వచ్ఛమైన వాతావరణం, చుట్టుపక్కల ఉన్న పచ్చని పంట పొలాలు ఈ పక్షులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరుగుతున్న తరుణంలో, మానేరు వాగు వంటి ప్రాంతాలు ఈ వలస పక్షులకు సురక్షిత ఆశ్రయాలుగా మారడం విశేషం. విదేశీ అతిథుల రాకతో మానేరు తీరం జీవకళను సంతరించుకుంది. ఈ సహజ సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. పక్షులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, కాలుష్యం లేకుండా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..

Jai Hanuman: లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *