విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ‘తెలంగాణ విద్యా కమిషన్’ చైర్మన్ అకునూరి మురళి బృందం సమర్పించిన ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026’ నివేదికకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ప్రారంభం కానున్నాయి. ఇక్కడ నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉంటుంది. మొత్తం 2,000 పాఠశాలలను అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నారు. ప్రతి పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తారు. సుదూర ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కూల్ బస్సు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గ్రామాలతో అనుసంధానం చేస్తారు. ఈ నివేదిక రూపకల్పన కోసం కమిషన్ 14 నెలల పాటు పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ, రాబోయే బడ్జెట్‌లో వీటికి అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే దక్కే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *