బస్సులో ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు భయంతో గట్టిగా అరిచారు. స్థానిక అధికారులు వారిని రక్షించడం కోసం జేసీబీని రంగంలోకి దించారు. దాని సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సుంకేసుల డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడంతో ఉయ్యాలవాడ–జమ్మలమడుగు రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటన వరద ప్రభావిత ప్రాంతాలలో ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తుచేసింది. అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసారు. వరద పోటెత్తి ప్రవహించే వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని ప్రజలకు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్లు.. కొనుగోలు బిల్లు వైరల్
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్కి అవాక్కవ్వాల్సిందే
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా