ఉగాది పండగకు ముందే కొన్ని రాశులకు అదృష్టం పట్టబోతోంది. మార్చి నెల 11వ తేదీ తర్వాత దేవతల గురువైన బృహస్పతి (గురు గ్రహం) ప్రత్యేకమైన సంచారం చేయబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ముఖ్యమైన మార్పులు కనిపించనున్నాయి.
గురు గ్రహం జ్ఞానం, విద్య, వివాహం, సంతానం, ఆధ్యాత్మికతకు కారకుడిగా భావించబడుతుంది. జీవితంలో లక్ష్యాలను సాధించడానికి గురువు అనుగ్రహం ఎంతో ముఖ్యమని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు గురుడు మిథునరాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి శుభఫలితాలు కలగనున్నాయి.
మేష రాశి..
మేషరాశి వారికి కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే బలపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. జీవితంలో పురోగతి కనిపించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.
పరిహారం: బృహస్పతికి లేదా మీకు ఇష్టమైన గురువుకు నానబెట్టి ఉడికించిన శనగలను నైవేద్యంగా సమర్పించాలి. ఎలాంటి కోరికలు కోరుకోకుండా భక్తితో సమర్పించడం శ్రేయస్కరం.
మిథున రాశి..
మిథునరాశి వారికి కుటుంబంలో మంచి సంబంధాలు కొనసాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అనుభవించని ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయం వచ్చే కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి. గురువు అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది.
పరిహారం: శివాలయం లేదా ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతిరోజూ ప్రదక్షిణ చేయడం మంచిది. గురువారం రోజున బృహస్పతికి శనగలతో పూజ చేయాలి.
సింహ రాశి..
సింహరాశి వారు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు తగ్గి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురువును పూజించడం వల్ల అనుకున్న ఫలితాలు పొందవచ్చు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)




