మండుతున్న ఎండలు! మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడిగాలులు.. ముప్పు తప్పదా?

మండుతున్న ఎండలు! మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడిగాలులు.. ముప్పు తప్పదా?


ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. గత మూడు సంవత్సరాలలో అత్యంత వేడి నెలగా ఈ ఏడాది ఫిబ్రవరి నెల రికార్డు్ సృష్టించింది. అంతేకాకుండా, మార్చి కూడా మండే ఎండలు, తీవ్రమైన వేడితో ప్రారంభమైంది. గతంలో, మార్చి 1 నుండి మార్చి రెండవ లేదా మూడవ వారం వరకు జనం స్వెటర్లు, జాకెట్లు ధరించేవారు. కానీ ఈ సంవత్సరం, ఫిబ్రవరి రెండవ వారం నుండే ప్రజలు తమ స్వెటర్లు, జాకెట్లను దూరం పెట్టారు. ప్రస్తుతం, మార్చి 1 నుండి మండే ఎండలు ప్రారంభమయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే మార్చి 1 నుంచి వాతావరణం చాలా వేడిగా మారిపోయింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక సూచనను జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ మార్చి 4 నుండి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, ఈ సంవత్సరం వేడిగాలులు ఏ రికార్డులను బద్దలు కొడతాయో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటు ఎల్నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాను కుదిపేస్తోంది. వేడి వడగాలులతో టెన్షన్ పెడుతోంది. జాతీయస్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతున్నాయి. గత వేసవిలో దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38° ఉష్ణోగ్రత నమోదయింది. 2024 లో ఇప్పటివరకు దేశంలోనే ఎక్కడా ఎప్పుడు లేనివిధంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో గాలిలో తేమ 15 శాతానికి పడిపోవటం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఏడాది అత్యధికంగా పడగాలులు విచి డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలులో జాతీయస్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *