బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సుకుమార్ శిష్యులు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సుకుమార్ శిష్యులు


బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సుకుమార్ శిష్యులు

ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు, ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యులు సినీ ప్రపంచాన్ని ఏలారు. సుదీర్ఘ విరామం తర్వాత, లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులు ఇప్పుడు కొత్త టాలెంట్‌ను వెండితెరకు అందిస్తున్నారు. కెరీర్‌ ప్రారంభంలోనే గురువుతో పోటీపడే స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు వంటి యువ దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో తమదైన ముద్ర వేస్తున్నారు.రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్న జానర్‌లను ఎంచుకుంటూ వీరు ఇండస్ట్రీకి కొత్త దారి చూపిస్తున్నారు. ఉప్పెనతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దసరా సినిమాతో నానిని సరికొత్తగా చూపించిన శ్రీకాంత్ ఓదెల, అదే కాంబినేషన్‌లో “ది పారడైజ్” చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. విరూపాక్షతో థ్రిల్లింగ్ విజయం సాధించిన కార్తీక్ దండు, నాగచైతన్య హీరోగా “వృషకర్మ”ను తెరకెక్కిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *