బహ్రెయిన్లో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితులపై అక్కడి నివాసి శెట్టి సతీష్ ఒక ప్రత్యక్ష నివేదికను అందించారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయని, గత రాత్రి, ఈ ఉదయం కూడా కొన్ని దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ దాడులను బహ్రెయిన్ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతోందని పేర్కొన్నారు. బహ్రెయిన్ ప్రభుత్వం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలందరూ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉన్నారు. దాడులు ప్రధానంగా US నావల్ బేస్లు, US సైనిక స్థావరాలపై జరుగుతున్నాయని, పౌరులపై ఎటువంటి దాడులు జరగడం లేదని శెట్టి సతీష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వం ఇరాన్ నుండి వచ్చే డ్రోన్, మిస్సైల్ దాడులను కౌంటర్ అటాక్ చేసి నిలువరిస్తోందని, పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :