ప్రధాని మోదీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కేరళ పేరును “కేరళం”గా మారుస్తూ ఆమోదం!

ప్రధాని మోదీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కేరళ పేరును “కేరళం”గా మారుస్తూ ఆమోదం!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి ఆమోదం తెలిపింది. భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, కేరళకు కేరళం అని పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సంవత్సరం జరగనున్న కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మంగళవారం (ఫిబ్రవరి 24, 2026)న ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కొత్త భవనం ‘సేవా తీర్థ’లో కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ జూన్ 24, 2024న ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొదటి ప్రతిపాదనను సమీక్షించి, కొన్ని సాంకేతిక మార్పులను సూచించింది. దీంతో కేరళ శాసనసభ రెండవసారి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో జాబితా చేసిన అన్ని భాషలలో దక్షిణాది రాష్ట్రం పేరును కేరళ నుండి “కేరళం”గా మార్చాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేరళ అసెంబ్లీ ఆగస్టు 2023లో ఇదే విధమైన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే హోమ్ మంత్రిత్వ శాఖ కొన్ని సాంకేతిక మార్పులను సూచించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, రాష్ట్ర అధికారిక పేరును “కేరళ” నుండి “కేరళం” గా మార్చాలని డిమాండ్ చేశారు. “కేరళం” అనే పేరు మలయాళ భాషకు, రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుకు లోతుగా అనుసంధానించబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *