పూరి జగన్నాథ్ భవిష్యత్ ప్రాజెక్టులపై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో “స్లమ్ డాగ్” అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా ఒక మంచి తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్కు కాల్షీట్లు ఇవ్వడంతో ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడం గ్యారెంటీ అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో కూడా మొదలైంది. ఈ బజ్ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నడిపిన్ నాయగన్ సూర్యను కలిసి ఒక కథను వివరించారని, సూర్య కూడా సానుకూలంగా స్పందించారని కోలీవుడ్ సమాచారం. గతంలో పూరి తన “బిజినెస్ మ్యాన్” స్క్రిప్ట్ను సూర్యకే మొదట చెప్పారని, ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :