మనం చూసిన వెంటనే భయపడి పారిపోయే జంతువులు ఏమైనా ఉన్నాయా అంటే అవి పాములు, పులి, సింహం. కానీ, వీటి కన్నా కూడా ప్రాణాంతకమైన జీవి కూడా ఉంది.
ఇది చూడటానికి కంటిలో నలుసంత ఉంటుంది కానీ, కుడితే మాత్రం దురద విపరీతంగా వస్తుంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? అది ఇంకేదో కాదండి. మన రోజూ చూస్తున్న దోమ.
ఒక చిన్న దోమ వల్ల ప్రతి ఏడాది ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దోమ ఏం చేస్తుందిలే అనుకుంటే పొరపాటే.. నిపుణుల చేసిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి.
‘డిస్కవర్ వైల్డ్లైఫ్’ చెప్పిన దాని ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దోమల కుట్టడం వలన పది లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది.
అంటే పులి, పాము వల్ల చనిపోయే వారి కంటే రెండు రెట్లు ఎక్కువ.
అయితే, ఈ దోమలు మనుషులను డైరెక్ట్ గా చంపవు, కానీ ఇవి కుట్టిన తర్వాత మలేరియా, డెంగ్యూ జ్వరంతో మంచాన పడి ప్రాణాలు వదులుతున్నారు. అందుకే, ఇంటి దగ్గర ఉన్న నిల్వ నీరును శుభ్రం చేసుకుంటూ ఉండాలి.




