అయితే.. వీరి అనుమానాలను నిజం చేసేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అక్కడ ఓ జాతరలాంటి కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేలాదిమందితో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు నిర్వాహకులు. ఈ ప్రదేశంలో పెద్దమొత్తంలో సరుకులు కూడా ఉన్నాయి. ఆరుబయట ఓ భారీ కుండలో పప్పు వండుతున్నారు. ఆ పప్పును కలపాలంటే ఓ పెద్ద గరిటె కావాలి. అయితే నిర్వాహకులు పప్పును కలిపేందుకు ఏకంగా ఓ జేసీబీని తీసుకొచ్చారు. ఆ జేసీబీ ఆ పప్పును కలుపుతోంది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వారు వంట చేస్తున్నారా.. ఏదైనా నిర్మాణపనులు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అంత పెద్ద మొత్తంలో వంటచేయడానికి ఈ పద్ధతి సులువే అయినా.. పరిశుభ్రత విషయంలో ఆందోళన చెందడం సహజం అని కొందరు కామెంట్ చేశారు. అయితే ఆ యంత్రాన్ని ముందే శుభ్రపరిచి ఉంటారని కొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట
కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్లో ఉంటుందంటే
ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే
Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్
యూట్యూబ్లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే