కావాల్సిన పదార్ధాలు : అర కిలో మటన్, 100 గ్రాముల పచ్చి మిర్చి, 2 ఉల్లిపాయలు, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, నూనె, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి.
ముందుగా మటన్ను రెండు సార్లు శుభ్రం చేసి డానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి,కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.
ఆ తర్వాత మిక్సీ పట్టిన పచ్చి మిర్చిని వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మటన్ వేసి 15 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా మగ్గించాలి.
మటన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే బాగా ఉడికించాలి. చివర్లో ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర కట్ట కొత్తిమీర వేసి దించి వేడి వేడి అన్నంలో రుచి అద్భుతంగా ఉంటుంది.




