దసరా, దీపావళి పండుగల సమయంలో వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం ద్వారా జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. కేవలం రూ.11 ప్రీమియంతో రూ.25,000 విలువైన బీమా పాలసీని ఫోన్ పే అందిస్తోంది. ఈ పాలసీ కింద పాలసీదారుడు, వారి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా లేదా మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 11 రోజుల పాటు ఈ పాలసీ చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఫోన్ పే యాప్ ద్వారా నిమిషం లోపే ఈ బీమాను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో