
టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న ప్రముఖ గ్రాస్రూట్ ఫుట్బాల్ కార్యక్రమమైన News9 ఇండియన్ టైగర్స్ అండ్ ట్రిగర్స్ జాతీయ స్థాయి ట్రయల్స్ తొలి రోజు డిబ్రుగఢ్లోని ఖనికర్ స్టేడియంతో హట్టహాసంగా ప్రారంభయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ట్రయల్స్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువ ఫుట్బాల్ ప్రతిభావంతులు ఉత్సాహంగా పాల్గొన్నారు
డిబ్రుగఢ్లో జరుగుతున్న ఈ ట్రయల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారీ గ్రాస్రూట్ టాలెంట్ టెస్ట్లో చివరి జాతీయ ఎంపిక దశగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన స్కౌటింగ్ ప్రక్రియ తర్వాత తదుపరి దేశానికి కాబోయే ఫుట్బాల్ స్టార్లను గుర్తించేందుకు ఈ జాతీయ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే తొలి ట్రయల్స్లో దేశ వ్యాప్తంగా సుమారు 38,000 మందికి పైగా ఆటగాళ్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. అన్ని దశల టెస్ట్ల తర్వాత అస్సాంలోని దిబ్రూఘర్లో జరుగుతున్న మూడు రోజుల జాతీయ ట్రయల్స్లో పోటీ పడటానికి కేవలం 300 మంది యువ ఫుట్బాల్ క్రీడాకారులు మాత్రమే షార్ట్లిస్ట్ చేయబడ్డారు.
ఈ 300 మందిలో కేవలం 25 మంది ప్రతితాభవంతులైన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసి జర్మనీకి పంపనున్నారు. అక్కడ వారు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి తరపున ఫుడ్బాల్ ఆడేందుకు ఉన్నత సౌకర్యాలలో అధునాతన ఫుట్బాల్ శిక్షణ తీసుకొని మరింత ప్రతిభావంతులుగా తయారుకానున్నారు.
అస్సాంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఎంతో సహకారం అందించిందని.. రాష్ట్ర క్రీడా పరిపాలన విభాగం మద్దతుతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రోత్సాహం కూడా లభించింది. అలాగే అస్సాం స్పోర్ట్స్ అథారిటీ క్రీడల ప్రత్యేక కార్యదర్శి సహకారంతో ఈ భారీ స్థాయి కార్యక్రమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్వహణ సక్రమంగా ఏర్పాటయ్యాయి.
ఒక్క అస్సాంలోనే కాదు న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఫుట్బాల్ సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకుంది. వీటిలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, లడఖ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుండి ఫుట్బాల్ సంఘాలు, క్రీడా అధికారులతో సహకారాలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.