ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. ముసుగులు ధరించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా..?

ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. ముసుగులు ధరించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా..?


ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. ముసుగులు ధరించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా..?

సభ్యసమాజం సిగ్గుపడే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఖాండ్వా జిల్లాలో ఈ హృదయ విదారకమైన, సిగ్గుచేటు సంఘటన జరిగింది. ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు 90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పునాస పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గాయపడిన వృద్ధురాలిని చికిత్స కోసం ఖాండ్వా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధ మహిళ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది, ఆమె వేరే గ్రామంలో నివసిస్తుంది. ఈ సంఘటన తర్వాత, గ్రామస్తులు ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇంటికి చేరుకున్నప్పుడు, ఆమె తల్లి రక్తపు మడుగులో మంచం మీద పడి ఉండటాన్ని చూసింది. దీంతో వెంటనే పునాస పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుర్తుతెలియని అనుమానితులపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఖాండ్వా పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ తెలిపారు. వారి ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.

మరిన్ని క్రైమ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *