మధ్యాహ్నం 3.20 గంటలు నుంచి సాయంత్రం 6.47గంటల వరకూ చంద్రగ్ర హణ ఉంటుంది. గ్రహణ సమయానికి 3 నుంచి 6గంటలు ముందుగా అన్ని ఆలయాలు తలు పులు మూసివేస్తారు.గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత మాత్రమే తెరుస్తారు. పాదగయ క్షేత్రంలో అందుకు భిన్నంగా అన్ని ఆలయాలు తెరిచే ఉంటాయి. చంద్రగ్రహణ సమయంలో కుక్కుటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వ హిస్తారు. అర్చకులు, వేదపండితులు జపాన్ని ఆచరిస్తారు. పాదగయలో పట్టు, విడుపు స్నానాలు ఆచరించి గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి మరో మారు పూజాది కార్యక్రమాలు జరిపిస్తారు. గ్రహణ సమయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచి పూజలు నిర్వహిస్తామని ఆలయ వేద పండితులు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :