
గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు అనూహ్యంగా హైదరాబాద్లోని హోటల్ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల వల్ల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ హోటళ్లు వంటలు చేయలేక చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘పిస్తా హౌస్’ తమ మెనూలోని దాదాపు 750 రకాల వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. గ్యాస్ కొరత తీవ్రం కావడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్నారు. ఆధునిక కిచెన్ల స్థానంలో మళ్లీ పాత కాలం నాటి బొగ్గు, కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీ తయారీకి కట్టెలను వాడుతున్నప్పటికీ, అన్ని రకాల వంటకాలను ఈ పద్ధతిలో చేయడం సాధ్యం కాకపోవడంతో మెనూలో చాలా రకాల వంటకాలను తగ్గించేస్తున్నారు. కేవలం పిస్తా హౌస్ మాత్రమే కాకుండా, నగరంలోని అనేక రెస్టారెంట్లు ఆన్లైన్ ఆర్డర్లను కూడా తగ్గించేశాయి. బిర్యానీ లభించని చోట వినియోగదారులు హలీమ్ వంటి ఇతర వంటకాలతో సర్దుకుపోతున్నారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఇబ్బందులు తప్పవని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా అనేక హోటళ్లు ‘అన్అవైలబుల్’ అని చూపిస్తుండటంతో ఫుడ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు