జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల ప్రత్యేక రాజయోగాలు కూడా ఏర్పడుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక రాజయోగం గురించి తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు తొమ్మిది గ్రహాలలో రాక్షసులకు గురువుగా ప్రసిద్ధి. శుక్రుడు అందం, ప్రేమ, విలాసం, సంపద, కళలు, శ్రేయస్సుకు కారకుడిగా భావించబడతాడు. వృషభం, తులా రాశులకు అధిపతి అయిన శుక్రుడు తన స్థానం మార్చిన ప్రతిసారి అన్ని రాశుల జీవితాలపై ప్రభావం చూపుతాడు. 2026 మార్చి 1న శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో శని కూడా ఇప్పటికే మీనరాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల, ఈ రెండు గ్రహాల కలయికతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.