కరూర్‌ ఘటన పై స్పందించిన విజయ్.. నా హృదయం ముక్కలైందంటూ..

కరూర్‌ ఘటన పై స్పందించిన విజయ్.. నా హృదయం ముక్కలైందంటూ..


తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్‌.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు, వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై విజయ్ స్పందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

హృదయం బరువెక్కింది, భరించలేని, మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను. కరూరులో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేతగా విజయ్ భారీ సభను ఏర్పాటు చేశాడు. ఈ సభకు పోలీస్ అనుమతి కూడా తీసుకున్నారు. 10వేలమందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు కానీ విజయ్ అభిమానులు అక్కడకు భారీగా వచ్చారు దాంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. ఒకరిమీద ఒకరు పడి తొక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. 50కి పైగా గాయపడ్డారు. ఆరుగురు చిన్నారులు, 16మంది మహిళలు చనిపోయారు. తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం.  చనిపోయిన వారికిరూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు సీఎం స్టాలిన్.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *