ఇందులో భాగంగా, ఆలయ సమీపంలోని చెరువు మధ్యలో ఏకంగా 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయటంతో బాటు పలు కీలక ప్రతిపాదనలను టీటీడీ తెరపైకి తెచ్చింది. ఈ బృహత్ ప్రణాళికను టీటీడీ నియమించిన నిపుణుల కమిటీ రూపొందించింది. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఇటీవలే ఈ రిపోర్టును టీటీడీకి అందజేశారు. రాబోయే 30 ఏళ్లలో ఒంటిమిట్టకు వచ్చే భక్తులు రద్దీని అంచనా వేసి, అందుకు తగిన సౌకర్యాలతో ఈ ప్రణాళికను తీర్చిదిద్దారు. రామాలయం దగ్గరలోని చెరువు కడప-రేణిగుంట జాతీయ రహదారికి, చెన్నై-ముంబై రైలు మార్గానికి మధ్యలో ఉంది. ఈ చెరువు మధ్యలో భారీ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దితే టూరిస్టులను, భక్తులను విశేషంగా ఆకర్షించవచ్చని నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలైతే ఒంటిమిట్ట క్షేత్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమని భావిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. 16వ శతాబ్ధంలో ఈ రామాలయాన్ని సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ భారతదేశంలోనే ఉన్న అతిపెద్ద ఆలయ గోపురాలలో ఒంటిమిట్ట ఆలయ గోపురం ఒకటని కీర్తించాడు. ఈ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ హనుమంతుడు ఉండడు. భారతదేశంలోనే హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇది. అంతేకాదు ఈ ఆలయంలో సీతా,రామ,లక్ష్మణులు ఒకే శిలపై ఉండటంతో ఈ ప్రాంతం ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలతో, విశాలమైన ఆవరణలో అద్భుతంగా ఉంటుంది. 160 అడుగుల ఆలయ ముఖద్వారంతో, 32 శిలా స్తంభాలతో కూడిన రంగమంటపం ఆకట్టుకుంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు
పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్.. కారణం ఇదే
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం
Weather Update: హైదరాబాద్కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్