
భారతీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన కొత్త స్మార్ట్ఫోన్ లావా బోల్డ్ 2 ఫైవ్ జీను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్ను మార్చి 13న మధ్యాహ్నం అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లావా తన అధికారిక పేజీని అమెజాన్లో అప్డేట్ చేయడంతో ఈ తేదీ ఖరారైంది. లాంచ్ తర్వాత ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఆధునిక ఫీచర్లు
లావా బోల్డ్ సిరీస్తో ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో కూడిన సరసమైన ధరలో ఫోన్లను అందించడంపై దృష్టి పెట్టింది. అదే విధంగా బోల్డ్ 2 ఫైవ్ జీ కూడా బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వస్తోంది.
డిజైన్లో ప్రత్యేకత
టీజర్ చిత్రాల ప్రకారం ఈ ఫోన్లో ముఖ్యమైన ఫీచర్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. అంటే స్క్రీన్ను తాకడం ద్వారా ఫోన్ను అన్లాక్ చేయవచ్చు.
ఫోన్ ముందు భాగంలో సెంటర్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. డిస్ప్లే చుట్టూ స్లిమ్ బెజెల్స్ ఉండగా దిగువ భాగంలో కొంచెం మందంగా ఉంటుంది.
- ఫ్లాట్ ఫ్రేమ్
- ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్
- వెనుక భాగంలో రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ ఉంటాయి.
- వెనుక భాగంలో రెండు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్ కుడి వైపున ఉంటాయి.
ప్రస్తుతం టీజర్లో ఒక బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే కనిపించింది. అయితే లాంచ్ సమయంలో మరిన్ని రంగులను ప్రకటించే అవకాశం ఉంది. కెమెరా స్పెక్స్, ప్రాసెసర్, డిస్ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం, ర్యామ్ వంటి పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ గత సంవత్సరం విడుదలైన లావా బోల్డ్ ఫైవ్ జీకు తదుపరి వెర్షన్గా రానుంది. ఆ మోడల్ ఏప్రిల్ 2025లో రూ.10,499 ప్రారంభ ధరతో విడుదలైంది.
అందులో 6.67 అంగుళాల త్రీడీ కర్వ్డ్ అమెోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి