నీటి కాకులు అరుదుగా కనబడుతుంటాయి. కేవలం చెరువులు.. కుంటల్లో మాత్రమే ఉంటాయి. అయితే, ఈ కాకులు.. చేపలను సైతం తింటాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన కాకులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఎగబడుతున్నారు. మరోవైపు, చేపలను తింటూ తమ కడుపుకొడుతున్న నీటికాకులను చూసి మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పంట పొలాల సమీపంలో ఉన్న నాగయ్య కుంటలో నీరు కాకులు వందల సంఖ్యలో వచ్చి చెరువులో సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో నీటీకాకులు రావడంతో రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి గంటకు పైగా చెరువులో సందడి చేస్తున్న దృశ్యాలను తిలకిస్తున్నారు రైతులు.
చెరువులో ఉన్న చేపలను నీటీ కాకులు తినేస్తాయోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గుంపులు గుంపులుగా నీటిలో తిరుగుతున్నాయి. అయితే ఇవి చేపలను వేటాడుతున్నాయి. చేపలు తినడంతో మత్స్య కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడు కూడా నీటికాకులను చూడలేదని చెబుతున్నారు. వాటిని ఎంత వెళ్లగొట్టిన చెరువులో నుంచి వెళ్లడం లేదంటున్నారు. దీంతో చెరువులో ఉన్న చేపలని తినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అరుదుగా కనిపించే నీటి కాకులు చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్లలో నీటికాకుల దృశ్యాలను బంధిస్తన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..